10,400 ఎకరాల్లో పరికరాలు అవసరం | - | Sakshi
Sakshi News home page

10,400 ఎకరాల్లో పరికరాలు అవసరం

Jun 12 2025 11:04 AM | Updated on Jun 12 2025 11:04 AM

10,400 ఎకరాల్లో పరికరాలు అవసరం

10,400 ఎకరాల్లో పరికరాలు అవసరం

జిల్లాలో ఈసారి కొత్తగా 10,400 ఎకరాల్లో డ్రిప్‌, స్ప్రింక్లర్లు ఏర్పాటుచేయడం లక్ష్యం. ఇందులో భాగంగానే 6,500ఎకరాల్లో ఆయిల్‌పామ్‌, 2,700ఎకరాల కురగాయలు, పండ్ల తోటలు, మరో 1,200 ఎకరాల్లో ఇతర పంటలకు స్ప్రింకర్లను అందించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉద్యాన శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. గతేడాది ప్రభుత్వం జిల్లాలోని కూరగాయతోటల్లో డ్రిప్పు పరికరాల కోసం రూ. 5.39కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో 1112.5ఎకరాల్లో డ్రిప్‌ విస్తరించాలని కూడా టార్గెట్‌ నిర్దేశించారు. ఇకపోతే స్ప్రింకర్ల కోసం రూ. 97లక్షలు మంజూరు చేసింది. ఈ లెక్కన జిల్లాలో 516 యూనిట్లకు మాత్రమే పరికరాలు అందించే అవకాశం కలిగింది. పండ్ల తోటలకు కంటితుడుపుగా కేవలం 19ఎకరాల్లో డ్రిప్‌ కోసం రూ.40లక్షలు మాత్రమే మంజూరయ్యాయి. కాగా ఆయిల్‌పామ్‌కు మాత్రం పెద్దపీట వేస్తూ.. 4వేల ఎకరాల్లో విస్తరణకు రూ.7.85కోట్లు మంజూరయ్యాయి. ఈసారి నిధులు భారీగా పెరిగితే రైతుల అవసరాల తీరే అవకాశముంది. ప్రత్యేకించి ‘వెజిటబుల్‌ హబ్‌’గా ఆవిర్భవించిన సిద్దిపేట లాంటి జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు డ్రిప్‌, స్ప్రింక్లర్లకు బడ్జెట్‌ను పెంచాల్సి ఉంది. ఇక్కడి నుంచి కురగాయలు దేశంలోని ప్రముఖ నగరాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రత్యేకించి హైదరాబాద్‌ నగరానికి కురగాయలకు ఈ ప్రాంతామే ప్రధాన ఆధారం. ఈనేపథ్యంలో జిల్లాలో సాధారణ పంటలకు ధీటుగా కూరగాయలు, పండ్ల తోటలు సాగవుతుండటం వల్ల పరికరాల కోసం ఏటా రైతులు వేలల్లో దరఖాస్తులు అందిస్తున్నారు. అయినా నిధులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

డిమాండ్‌ ఎక్కువే..

ఈ అంశంపై జిల్లా ఉద్యాన శాఖాధికారి సువర్ణ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతుల నుంచి డ్రిప్‌, స్ప్రింక్లర్లకు భారీగా డిమాండ్‌ ఉన్న మాట వాస్తవమేనన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే కేటాయింపుల మేరకు ప్రాధాన్యత క్రమంలో పరికరాలు అందించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement