సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్థానికంగా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. త్వరితగతిన న్యాయమైన సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు.
ఎస్పీ పరితోష్ పంకజ్


