పకడ్బందీగా ఎన్నికల నియమావళి
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమెతో పాటు అధికారులు హాజరయ్యారు. స్టేజ్ 2, జోనల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


