
ప్రతీ ఇంటికి ప్రభుత్వ సేవలు
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: ప్రతీ ఇంటికి ప్రభుత్వ సేవలు అందించడమే ప్రజా పాలన ప్రధాన లక్ష్యం అని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి చివరి వరకు ఒకే ఉత్సాహంతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.