
డివిజన్ల అభివృద్ధికి నిధులివ్వండి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రామచంద్రపురం, భారతీనగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్తో ఎమ్మెల్యే మంగళవారం సమావేశం అయ్యారు. మూడు డివిజన్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, నిధుల సమస్యపై ఆయనకు వివరించారు. ప్రధానంగా నూతన కాలనీలలో రహదారులు, అంతర్గత మురుగునీటి కాలువలు, పార్కుల ఏర్పాటు, వీధి దీపాలు ఏర్పాటుకు వెంటనే నిధులు విడుదల చేయాలని అడిగారు. పలు కాలనీలలో నిధుల కొరత మూలంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ కర్ణన్ త్వరలోనే నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.