దివ్యాంగుల ఏఐ పరికరాలపై పరిశోధనలు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల ఏఐ పరికరాలపై పరిశోధనలు

May 14 2025 8:02 AM | Updated on May 14 2025 8:02 AM

దివ్యాంగుల ఏఐ పరికరాలపై పరిశోధనలు

దివ్యాంగుల ఏఐ పరికరాలపై పరిశోధనలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతను వినియోగించి పాక్షిక దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌ ఐఐటీ, ఎంఎన్‌ఆర్‌ వర్సిటీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు రెండు విద్యా సంస్థలు మంగళవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ఎంఎన్‌ఆర్‌ వర్సిటీ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రవివర్మ మాట్లాడుతూ...అభివృద్ధి చేసిన పరికరాలను ఆస్పత్రుల్లో పరీక్షించి పాక్షిక దివ్యాంగులకు ఇచ్చేందుకు ఈ పరిశోధనలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ ఫ్రొఫెసర్‌ రేనూజాన్‌, బిఏబుల్‌ హెల్త్‌ సంస్థ సీఈఓ హబీబ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

ఐఐటీహెచ్‌, ఎంఎన్‌ఆర్‌ యూనివర్సిటీ ఒప్పందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement