ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
పటాన్చెరు టౌన్: విద్యా హక్కు చట్టం ప్రకారం 25శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచితంగా ఇవ్వాలని.. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ పార్టీ పటాన్చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అధిక ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు, సీపీఎం, సీఐటీయూ నాయకులు శాంత కుమార్, శ్రీధర్, లకాన్, చక్రధర్ సింగ్, ఎంజీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment