ఇబ్రహీంపట్నం రూరల్: డేవిడ్రెడ్డి సినిమా టైటిల్, ట్రైలర్ ద్వారా రెడ్డి సమాజాన్ని అవమానించే విధంగా ప్రచారం జరుగుతున్నందున సినిమాపై చర్యలు తీసుకోవాలని హైందవ రెడ్డి సేనా రాష్ట్ర అధ్యక్షుడు అందెం నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డేవిడ్రెడ్డి పేరుతో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఈ టైటిల్ ప్రచార విధానం రెడ్డి వర్గంపై తప్పుడు అభిప్రాయాలు కలిగించే విధంగా ఉందన్నారు. సినిమా నిర్మాతలు, దర్శకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పేర్లు మార్పు చేయకుండా విడుదల చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు .
మేక పిల్లపై
కొండచిలువ దాడి
కొట్టి చంపేసిన గ్రామస్తులు
తాండూరు రూరల్: మేక పిల్లపై కొండచిలువ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మండలంలోని సంగెంకలాన్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకలను మేపేందుకు సమీపంలోని పొలాల వద్దకు తోలుకెళ్లాడు. అక్కడ కొండచిలువ మేక పిల్లను చుట్టుముట్టి చంపేసింది. మేకల కాపరి గుర్తించి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు వచ్చి కొండచిలువను కర్రలతో కొట్టి చంపేశారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
దోమ: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం దోమ మండలం ఐనాపూర్లోని ఐదు వందల ఏళ్లనాటి రామలింగేశ్వరుడి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ రజిత భాస్కర్గౌడ్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆలయం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కోరగా.. త్వరలో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శాంతుకుమార్, గ్రామస్తులు వెంకటేశ్, జాఫర్, ఉద్యమకారుడు మల్లన్న తదితరులు పాల్గొన్నారు.


