అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి కూల్చివేత
ఇబ్రహీంపట్నం: నిబంధనలకు విరుద్ధంగా నిర్మి స్తున్న ఓ ఇంటిని రెవెన్యూ అధికారులు శుక్రవారం నేలమట్టం చేశారు. మండలంలోని ఖానాపూర్ రెవెన్యూ పరిధిలో ఆరున్నర ఎకరాలకు పైగా గ్యాప్ ఏరియా ఉంటుంది. ఓ వెంచర్ రియల్టర్స్ ఆ గ్యాప్ ఏరియాను ప్లాట్గా చేసి విక్రయించారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారని సమాచారం అందడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నర్సింగ్యాదవ్, సువర్ణ, ట్రైనీ డీటీ శ్రీనివాస్లు సిబ్బందితో వెళ్లి ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు. గ్యాప్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు.


