ఎన్ఎంఎంఎస్లో తుమ్మలూరు జెడ్పీహెచ్ఎస్ సత్తా
మహేశ్వరం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)కు మండలంలోని తుమ్మలూరు జెడ్పీహెచ్ఎస్ నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రమౌలి తెలిపారు. 8వ తరగతికి చెందిన రాజమోని కుమార్, రాచులూరి రోహిత్, మంచాల బిందుప్రియ స్కాలర్షిప్నకు ఎంపికయ్యారు. వీరికి ఒకొక్కక్కరికి ఏడాదికి రూ.12 వేల చొప్పున రూ.48 వేలు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుంది. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థల సర్పంచ్ తుమ్మడి అండాలు, పాఠశాల పూర్వ విద్యార్థి, సామాజికవేత్త కటికల యాదగిరి అభినందించారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని చెప్పారు.
స్కాలర్షిప్నకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక
ఎన్ఎంఎంఎస్లో తుమ్మలూరు జెడ్పీహెచ్ఎస్ సత్తా
ఎన్ఎంఎంఎస్లో తుమ్మలూరు జెడ్పీహెచ్ఎస్ సత్తా


