ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం తగదు

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం తగదు

ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం తగదు

● సత్వరమే సమస్యలు పరిష్కరించాలి ● స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజావాణిలో వచ్చిన అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సత్వరమే పరిష్కరించాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి ఆయన రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం సమస్యలు విని దరఖాస్తులు స్వీకరించే విధంగా కాకుండా పరిష్కారాల వేదికగా నిలిచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఈ వారం మొత్తం 43 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, మండల తహసీల్దారులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement