ఫీజుల పేరుతో వేధించే కళాశాలలపై చర్యలు
చేవెళ్ల: ఫీజుల పేరుతో పరీక్షలు సమయంలో హాల్టికెట్లు ఇవ్వకుండా వేధించే ప్రైవేట్ కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి బి.అరుణ్కుమార్ అన్నారు. చేవెళ్లలో శనివారం ఎస్ఎఫ్ఐ నాయకులు డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పరీక్షలు సమయం వచ్చిందని కార్పొరేట్ కళాశాల్లో విద్యార్థులను ఫీజుల పేరుతో వేధిస్తే ఆ కళాశాలలపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ చందు, చరణ్గౌడ్, మణికంఠ, వినోద్, తరుణ్, సంతోష్, వేణు, రిశికిరణ్ తదితరులు ఉన్నారు.


