స్కూటీని ఢీకొట్టిన లారీ
వ్యక్తి దుర్మరణం
కొందుర్గు: స్కూటీని లారీ ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం లాల్పహాడ్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలుకు చెందిన చాంద్ పాషా(40) లాల్పహాడ్ వద్ద పాన్షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించేవారు. అతడికి భార్య అమీరా బేగంతోపాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే శనివారం సాయంత్రం తన స్వగ్రామం రాపోలు నుంచి లాల్పహాడ్ స్కూటీపై వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో స్కూటీ నడుతున్న చాంద్పాషాపై నుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయి అక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి భార్య అమీరా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు.


