ఆర్టీసీలో సమ్మె సైరన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

● ప్రభుత్వంలో ఉద్యోగుల విలీన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి. ● 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ చేయాలి. ● ప్రభుత్వం ఆర్టీసీకి మహాలక్ష్మీ పథకం డబ్బులు నేరుగా అందించాలి. ● ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. సిబ్బందిపై కేఎంపీఎల్‌, ఈపీకే వేధింపులు మానుకోవాలి. ● ఎలక్ట్రిక్‌ బస్సులను, అద్దె బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనివ్వాలి. ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వొద్దు. ● అద్దె బస్సులు, వాటి డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసుకోవాలి. ● 2019 సమ్మె కాలంలో నమోదైన పోలీస్‌ కేసులను ఎత్తివేయాలి. ● మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. ● రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. అన్ని కేటగిరీల్లో ఖాళీలు భర్తీచేయాలి. ● రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. దీర్ఘకాలికంగా పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి.

రేపటి నుంచి బస్సులు బంద్‌

జిల్లా ప్రయాణికులకు కష్టాలు

సిరిసిల్లటౌన్‌: ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుంది. నిర్విరామంగా పరుగులు తీస్తున్న బస్సు చక్రాలకు బ్రేక్‌ పడనుంది. జిల్లాలోని రెండు డిపోలలో బుధవారం నుంచి బస్సులు నిలిచిపోనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. ఫలితంగా ఏడేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలుకానున్నాయి.

డిమాండ్లు ఇవీ..

మేనిఫెస్టోలోని అంశాన్ని అడుగుతున్నాం

ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆర్టీసీ రెండు విభాగాలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే ఇక్కడి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. విద్య, వైద్యంతోపాటు రవాణా సంస్థను సైతం లాభనష్టాలతో పరిగణించొద్దు.

– బాణయ్య, జేఏసీ చైర్మన్‌

Advertisement
 
Advertisement
Advertisement