ఇష్టారీతిన అర్బన్బ్యాంకు సభ్యత్వాలు
డీసీవోకు మానవహక్కుల కమిటీ ఫిర్యాదు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని సహకార ఆర్బన్ బ్యాంకు సభ్యత్వ నమోదును అధికారులు, పాలకవర్గం కుమ్మకై ్క ఇష్టారీతిన చేపడుతున్నారని జిల్లా మానవహక్కుల కమిటీ అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు శనివారం జిల్లా సహకారశాఖ ఆఫీస్ ఎదుట కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి మాట్లాడారు. బ్యాంకులో కొత్త సభ్యత్వాలను పాలకవర్గానికి నచ్చినవారు, బంధువులకు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్నారు. జాతీయ మానవ హక్కుల కమిటీ పట్టణ అధ్యక్షుడు చిప్ప దేవదాస్, అధికార ప్రతినిధి మడికొండ శ్రీనివాస్, కుసుమ గణేశ్ పాల్గొన్నారు.


