న్యూస్రీల్
ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులకు వరంగా మారిన బీపీఎస్ క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు 3 వేలు పరిష్కరించింది 1500 దరఖాస్తులు నగరపాలక సంస్థ ఖాతాలోకి రూ.9.96 కోట్లు అధికారుల జేబుల్లోకి సుమారు రూ.3.36 కోట్లని ఆరోపణలు ఫోన్ పేల ద్వారా రూ.1.18 కోట్ల వసూళ్లను గుర్తించిన ఏసీబీ భారీగా జేబులు నింపుకున్న కార్పొరేషన్ అధికారులు
పేరుకే మోడల్.. మెనూ ఢమాల్!
చుండి మోడల్ స్కూల్లో మెనూ అధ్వానంగా ఉంటోంది. విద్యార్థులకు సరిపడినన్ని గుడ్లు, అన్నం వండటం లేదు.
‘‘మూటలు’’ అందితే చాలు.. అది ఎంతటి అక్రమమైనా...సక్రమమైపోతుంది. భవన నిర్మాణానికి ప్లాను ఉంటే ఒక రేటు...ప్లానులేకుంటే మరో రేటు... ఇదీ ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ రూటే సప‘‘రేటు’’గా మారింది. దీంతో నగరంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. తాజాగా ప్రభుత్వం అమలు చేసిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) స్కీం నగరపాలక సంస్థ అధికారులకు వరంగా మార్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రమబద్ధీకరణ మాటున కార్పొరేషన్లో ఉన్నతాధికారుల దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకూ అంది జేబులు కట్టలతో నిండిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి.
క్రమ డబ్బీకరణ!


