పదో రోజుకు చేరిన పారిశుధ్య కార్మికుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

పదో రోజుకు చేరిన పారిశుధ్య కార్మికుల సమ్మె

Jul 23 2025 5:44 AM | Updated on Jul 23 2025 5:44 AM

పదో రోజుకు చేరిన పారిశుధ్య కార్మికుల సమ్మె

పదో రోజుకు చేరిన పారిశుధ్య కార్మికుల సమ్మె

తాత్కాలికంగా సమ్మె విరమించిన ఇంజినీరింగ్‌ కార్మికులు

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికుల సమ్మె మంగళవారంతో పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు, ఇంజినీరింగ్‌ విభాగం కార్మికులు యధావిధిగా సమ్మె చేపట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్‌–124ను విడుదల చేయడంతో ఇంజినీరింగ్‌ విభాగం కార్మికులు మంగళవారంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. నగర కమిషనర్‌ సమ్మె శిబిరానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సుముఖంగా ఉందని చెప్పారు. అయితే విడుదల చేసిన జీఓ ప్రకారం కాకుండా తమ న్యాయమైన డిమాండ్లు తీరిస్తేనే ఊరుకుంటామని, లేకుంటే తిరిగి సమ్మె మొదలు పెడతామని ఇంజినీరింగ్‌ విభాగం కార్మికులు తెగేసి చెప్పారు. పారిశుధ్య కార్మికులు మాత్రం యధావిధిగా సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ సమ్మెకు మద్దతు ప్రకటించారు. పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement