
సాక్షి, తాడేపల్లి: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఏపీలో ఓట్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎందుకంటే చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్లైన్లో టచ్లో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబుతో రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్ టచ్లో ఉంటారని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ.. కర్ణాటక, మహారాష్ట్ర గురించి మాట్లాడతారు. కానీ, ఏపీ గురించి మాత్రం ఆయన ఎందుకు మాట్లాడటం లేదు?. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉంటారు. చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు?. అమరావతిలో ఎన్నో స్కామ్లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల నాటికి.. ఓట్ల లెక్కింపు నాటికి 12.5శాతం ఓట్లు పెరిగాయి. అంటే 48 లక్షల ఓట్లు పెరిగాయి.. ఇది ఎలా?’ అని ప్రశ్నించారు.
