'చంద్రబాబుకు మైండు సరిగా పనిచేయడం లేదు'

Undavalli Sridevi Fires On Chandrababu About Coronavirus Deaths - Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబుకు మైండు సరిగా పనిచేయడం లేదని అందుకే రోజూ చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. రాష్ట్రంలో కరోనాతో సెకనుకు ఒకరు చొప్పున చనిపోతున్నారంటున్న చంద్రబాబు.. దానికి రుజువులు చూపించాలంటూ డిమాండ్‌ చేశారు.కరువు, చంద్రబాబు కవల పిల్లలని.. ఒకపక్క రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతుంటే అది చూసి బాబు ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తన ఇంద్రభవనంలో కూర్చొని ఎల్లో మీడియా ద్వారా రోజు విషం కక్కుతున్న బాబు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని తేలిందంటూ శ్రీదేవి విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top