మంత్రి నిరంజన్‌రెడ్డికి షాక్‌.. ఆత్మాభిమానం చంపుకోలేకేనన్న నేతలు!

Shock To Minister Niranjan Wanaparthy ZP Chairman MPPs Resigns To BRS - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌:  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఇలాకా వనపర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) లో ముసలం మొదలైంది. మంత్రికి సన్నిహి­తులు­గా పేరొందిన ముఖ్య నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆర్‌.­లోక్‌నాథ్‌ రెడ్డితోపాటు వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ సాయిచరణ్‌రెడ్డి రాజీనామా చేసిన వారిలో ఉన్నా­రు.

ఈ మేరకు ఖిల్లాఘనపురం మండలం సల్కె­లాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీ­నామా చేస్తున్నట్లు పత్రాలు ప్రదర్శించారు. వీరితో­పాటు మరో 11 మంది సర్పంచ్‌లు, ఆరు­గురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ఉపస­ర్పం­­చ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్న­ట్లు స్వయంగా ప్రకటించడమే కాకుండా బీఆర్‌ఎస్‌ లో తాము ఎదుర్కొన్న బాధలను వెళ్లగక్కారు.

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక..: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లా­డుతూ మామూలు కార్మికులు సైతం ఆత్మ­గౌరవం కోరు­కుంటారని.. అలాంటిది అధికారంలో ఉండి కూ­డా ఆత్మగౌరవాన్ని పొందలేకపో­యామని ఆవేద­న వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవాన్ని తా­కట్టు పెట్టలేకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

నిరంజన్‌రెడ్డికి పేరొచ్చిందంటే మేమే కారణం
పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డికి నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమన్నారు.  ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో వారి మనసులో ఉందని.. త్వరలోనే వారు బాహాటంగా చెప్పే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలన అంతం కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కాగా, నియోజక­వర్గంలో ఇప్పటివరకు తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న మంత్రి నిరంజన్‌ రెడ్డికి అతడి సొంత సెగ్మెంట్‌ నుంచే వ్యతిరేకత పెల్లుబికడంతో పాటు తాజా పరిణామాలు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. 

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top