RK Roja: YSRCP MLA Comments On Chandrababu - Sakshi
Sakshi News home page

కుప్పం దెబ్బకు చంద్రబాబుకు పిచ్చెక్కింది: ఎమ్మెల్యే రోజా

Nov 25 2021 11:57 AM | Updated on Nov 25 2021 7:12 PM

MLA RK Roja Comments On Chandrababu - Sakshi

కుప్పం దెబ్బకు చంద్రబాబుకు పిచ్చెక్కిందని ఎమ్మెల్యే రోజా అన్నారు.

సాక్షి, అమరావతి: కుప్పం దెబ్బకు చంద్రబాబుకు పిచ్చెక్కిందని ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు సీఎంగా ఉండగా ఏరియల్‌ సర్వే చేయలేదా అని ప్రశ్నించారు. వరద బాధితుల దగ్గరకు వెళ్లిన చంద్రబాబు వారికేం చేశారు. వరద బాధితుల వద్దకు వెళ్లిన చంద్రబాబు.. తన బాధలు చెప్పుకున్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన బెట్టుకోవడం మానవ తప్పిదం. వాస్తవాలు బయటకు రాకుండా సీసీ ఫుటేజ్‌ డిలీట్‌ చేయించారని’’ ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు.
చదవండి: సీఎం జగన్‌కు మంచి పేరు వస్తోందని టీడీపీ కుట్రలు: అసెంబీల్లో మంత్రి కృష్ణదాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement