‘వైఎస్సార్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదపలేరు’

Minister Jogi Ramesh Takes On Pawan Kalyan - Sakshi

తాడేపల్లి: వచ్చే ఎన్నికల్లో అంతా కలిసొచ్చినా వైఎస్సార్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదపలేరని మంత్రి జోగి రమేష్‌ స్పష్టం చేశారు. సీఎం జగన్‌ నాయకత్వాన్ని దేశమంతా హర్షిస్తోందని జోగి రమేష్‌ తెలిపారు.

‘పవన్‌ కల్యాణ్‌ పగటి వేషగాడు. ఏపీకి విజిటింగ్‌ వీసా మీద వచ్చి మీడియాలో మాట్లాడి పారిపోతాడు. జనసేన కాదు.. అది సైకో సేన. సీఎం జగన్‌ నాయకత్వాన్ని దేశమంతా హర్షిస్తోంది. అంతా కలిసొచ్చినా వైఎస్సార్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదపలేరు. 2024లో పవన్‌ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం’ అని జోగి రమేష్‌ పేర్కొన్నారు.

చదవండి: మోదీతో పవన్‌ ఏం మాట్లాడితే మాకెందుకు?.. పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top