పార్టీ పెట్టిన పదేళ్లకు గుర్తొచ్చిందా పవన్‌: జోగి రమేష్‌ ఫైర్‌

Minister Jogi Ramesh Challenges To Janasena Pawan Kalyan - Sakshi

సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. సామాజిక న్యాయంపై చర్చకు సిద్దమా? అంటూ ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్‌ లేదంటూ ఫైర్‌ అయ్యారు.

కాగా, మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ముందుగా బీసీలకు పవన్‌ క్షమాపణలు చెప్పాలి. పార్టీ పెట్టిన పదేళ్లకు పవన్‌కు బీసీలు గుర్తొచ్చారు. చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ ఒక బానిస. 2014లో​ చంద్రబాబుతో కలిసి బీసీలకు ఇచ్చిన 125 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. బీసీలు తలెత్తుకునేలా బీసీల తలరాతను మార్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఏపీలో సామాజిక న్యాయం చూసి ఓర్వలేకపోతున్నారు. 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పలేని చవట దద్దమ్మలు. మీరంతా కలిసి కట్టుగా వచ్చినా సీఎం జగన్‌కు ఏమీ చేయలేరు’ అని కామెంట్స్‌ చేశారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top