
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పవన్ కుట్ర చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
సాక్షి, గుంటూరు: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పవన్ కుట్ర చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ తన అభిమానులతో రాళ్లు వేయించుకొనే పథకం పన్నారని, ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ కుట్ర చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు.
పవన్కు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది: అడపా శేషు
తాడేపల్లి: పవన్ కళ్యాణ్ది రోజుకో జెండా నిమిషానికో ఎజెండా అంటూ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మండిపడ్డారు. కాపులను రెచ్చగొట్టేవిధంగా పవన్ మాట్లాడుతున్నారని.. కాపు, బలిజలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. వంగవీటి రంగా హత్యకు కుత్రదారుడైన చంద్రబాబు జైలుకు వెళ్తే కాపులంతా సంతోష పడ్డారన్నారు. ‘‘పుంగనూరులో టీడీపీ నేతలు పోలీసులను కొడితే పవన్ మాట్లాడలేదు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని హింసించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. కాపు కులం.. పవన్కు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉంది’’ అని అడపా శేషు వ్యాఖ్యానించారు.
చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో?