ఢిల్లీలో పోరాటం... రాష్ట్రంలో రెడ్‌ కార్పెటా? | KTR questions Congress party double standards on Adani | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో పోరాటం... రాష్ట్రంలో రెడ్‌ కార్పెటా?

Aug 14 2024 5:50 AM | Updated on Aug 14 2024 5:51 AM

KTR questions Congress party double standards on Adani

అదానీ–సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించిన కేటీఆర్‌

అదానీతో దేశానికి నష్టమైనప్పుడు.. తెలంగాణకు ఎలా లాభమో చెప్పాలి  

సాక్షి, హైదరాబాద్‌: హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ–సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచి్చన కాంగ్రెస్‌ పార్టీ, తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదే కంపెనీకి స్వాగతం పలకడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. అదానీ విషయంలో జాతీయ కాంగ్రెస్‌కు ఒక నీతి..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మరో నీతా? అని రాహుల్‌ గాం«దీని ప్రశ్నించారు.

ఒకవైపు అదానీ–సెబీ ఆరోపణలపై జేపీసీ వేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రేమో అదానీకి స్వయంగా రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ ఆయన కంపెనీకి ద్వారాలు తెరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ఏకంగా అదానీకే అప్పగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

‘మీరు అదానీ–సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తే.. అదానీ–కాంగ్రెస్‌ మిలాఖాత్‌పైనా, లోపాయికారీ ఒప్పందాలపైనా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశి్నస్తున్నారు’అని రాహుల్‌గాం«దీని ఉద్దేశించి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అదానీ వల్ల దేశానికి నష్టం అన్నప్పుడు.. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం లాభమెలా అవుతుందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌లో ఈ ద్వంద్వ వైఖరి కాంగ్రెస్‌ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అధికారమిచి్చన పాపానికి.. తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పార్టీ బీఆర్‌ఎస్‌ అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్‌ హెచ్చరించారు.

బాన్సువాడ ఉప ఎన్నిక ఖాయం: కేటీఆర్‌ 
బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని, పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రజలు బుద్ది చెపుతారని కేటీఆర్‌ అన్నారు. పోచారంను అన్ని విధాలా గౌరవించినా కార్యకర్తల రెక్కల కష్టంపై గెలిచి స్వార్థం కోసం పార్టీని వీడారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు మంగళవారం నందినగర్‌ నివాసంలో కేటీఆర్‌ను కలిశారు. కష్టకాలంలో పారీ్టకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని కేటీఆర్‌ అన్నారు. త్వరలో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి తాను బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కాగా, గురుకుల పాఠశాలల్లో సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం సంతోషకరమైన అంశమని కేటీఆర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement