కేసీఆర్‌ అధ్యక్షతన మీటింగ్‌.. ఎర్రవెల్లి చేరుకున్న గులాబీ నేతలు | KCR Along With Party Leaders BRSLP Meeting At Erravalli Farmhouse | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ అధ్యక్షతన మీటింగ్‌.. ఎర్రవెల్లి చేరుకున్న గులాబీ నేతలు

Dec 8 2024 1:22 PM | Updated on Dec 8 2024 2:33 PM

KCR Along With Party Leaders BRSLP Meeting At Erravalli Farmhouse

సాక్షి, సిద్దిపేట: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరుగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్‌. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కొక్కరుగా ఎర్రవల్లికి చేరుకుంటున్నారు.

కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఎర్రవల్లికి వస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్ కుమార్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఎర్రవల్లి చేరుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement