విజయవాడ: తమ పార్టీకి అన్నింటిలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. టీడీపీకి తాము ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ వారు తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రతిదాంట్లో జనసేన అసంతృప్తిగానే ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు న్యాయం జరగడం లేదన్నారు.
జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నాం.. మాకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో జరిగే సమన్వయ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామన్నారు.


