మోదీ నాయకత్వంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: జీవీఎల్‌ 

GVL Narasimha Rao Comments On Nara Lokesh Padayatra - Sakshi

డాబాగార్డెన్స్‌/­అల్లిపు­రం (విశాఖ దక్షిణ): ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భార­త­­దేశం 2029–30 నా­టికి ప్రపంచంలోనే అ­తి­­పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాజ్య­సభ సభ్యుడు, ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆదివారం నగరంలోని ఓ హో­టల్లో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆ­య­న పాల్గొని మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్‌ అ­న్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉంద­న్నారు. ప్రపంచంలో 9వ పెద్ద ఆర్థిక వ్య­వస్థగా ఉన్న భారత్‌... మోదీ ప్రభుత్వం వచ్చాక ఐదో స్థానానికి ఎదిగిందన్నారు. ఈ బడ్జెట్‌లో రా­ష్ట్రా­లకు రూ.3.8 లక్షల కోట్లు కేటాయించారని తెలి­పారు. ఏపీకి కేంద్రం రూ.7 వేల కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. బీజేపీ నా­యకులు విష్ణుకుమార్‌­రాజు, లంకా దినకర్, మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

లోకేశ్‌ పాదయాత్రకు స్పందన లేదు
టీడీపీ నాయకుడు లోకేశ్‌ పాదయాత్రకు ప్రజ­ల నుంచి పెద్దగా స్పందన లేదని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం అమరా­వతిలోనే ఉంటుందని, సీఎం క్యాంపు ఆఫీస్‌ రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని, దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండకపోవ­చ్చన్నారు. రాజధానిగా విశాఖను ముందు­గానే నిర్ణయించి ఉంటే ఇంకా బాగుండేదని జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top