అసలు ‘తల్లికి వందనం’ ఎప్పటి నుంచి ఇస్తారు? | Former YSRCP MP Vanga Geeta Countered Sharmila Over Thalliki Vandanam Scheme, Details Inside | Sakshi
Sakshi News home page

అసలు ‘తల్లికి వందనం’ ఎప్పటి నుంచి ఇస్తారు?

Jul 14 2024 5:50 AM | Updated on Jul 14 2024 5:26 PM

Former YSRCP MP Vanga Geeta countered Sharmila

షర్మిల తాజా ట్వీట్‌కు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వంగా గీత కౌంటర్‌

సాక్షి, అమరావతి: ‘తల్లికి వందనం’ కార్యక్రమంపై రెండ్రోజుల క్రితం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల  గత వైఎస్సార్‌సీపీ సర్కా­రు­ను విమర్శించగా.. అదే రోజు వైఎస్సార్‌సీపీ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా ఆమె మళ్లీ శనివారం ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టుకు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వంగా గీత గట్టిగా బదులిచ్చారు. ‘టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15­వేలు చొప్పున ఇస్తుందా.. లేక ప్రతి తల్లికి మాత్ర­మే అంటూ జారీ­చేసిన జీఓ–29ని సరిదిద్దు­తుందా? అసలు ఎప్పటి­నుంచి ఈ పథకాన్ని అమలు­చేస్తా­రు?’ అంటూ షర్మిల పో­స్టు­కు జతచేస్తూ ప్రశ్నించా­రు.

అంతకుముందు.. షర్మిల తన శనివా­రం నాటి పోస్టులో.. ‘బాబుకి కాంగ్రెస్‌ తోక పార్టీ అని ముడి­పెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిద­ర్శనం. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసి­నట్లు ఎలా అవుతుంది?’ అని ఆమె తన తీరును సమర్ధించుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికల­కు ముందు జగన్‌ హామీలపై చర్చకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. ఈ పోస్టుకు గీత కౌంటర్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement