తిరువనంతపురం: కేరళలో బీజేపీ భవితవ్యంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎన్నటికీ అధికారంలోకి రాలేదని అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడారు.
కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. ఆ పార్టీ అకౌంట్ కూడా ఓపెన్ చేయదు. అసలు ఆ పార్టీ ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపించబోదు. ఇక్కడ పోటీ ఎల్డీఎఫ్-యూడీఎఫ్ మధ్యే ప్రధానంగా ఉండబోతోంది. విజయన్ పాలనలో కనీసం ఇళ్లు కూడా నిర్మించలేకపోయారు. భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. దీనిని మా యూడీఎఫ్ అధికారానికి సంకేతంగా భావిస్తున్నా అని అన్నారాయన.
2011లో తమ ప్రభుత్వానికి కేరళ ప్రజలు అధికారం ఇచ్చారని.. ఆ సమయంలో తక్కువ మెజారిటీ దక్కిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం భారీ మెజారిటీతో అధికారం కట్టబెడతారని ఆశిస్తున్నట్లు తెలిపారాయన.
Thiruvananthapuram, Keralam: Congress MP Shashi Tharoor says, "Last time we had an opportunity to run the government in 2011, the people gave us a very, very narrow majority. This time I'm hoping for a better number, a more comfortable basis for our government to make a real… pic.twitter.com/Fiz3BWtIR4
— IANS (@ians_india) April 9, 2026


