కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు | Congress MLA Rajagopal Reddy Key Comments Over Govt | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు

May 26 2026 8:28 PM | Updated on May 26 2026 9:19 PM

Congress MLA Rajagopal Reddy Key Comments Over Govt

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన వసతులు లేవని, మెస్‌ చార్జీలు పెంచినా, విద్యార్థుల భోజనంలో నాణ్యత లేదన్నారు. 

విద్య కోసం అవసరమైతే పోరాటానికి సిద్ధమవుతానని, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తే  అవి కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయన్నారు. అవే డబ్బులు విద్యకు ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు సరైన ప్రొటీన్‌ ఫుడ్‌ అందడం లేదన్నారు రాజగోపాల్‌రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement