ఢిల్లీలో ‘ఆప్‌’ వల్లే ఓడాం: కాంగ్రెస్‌ బ్లేమ్‌గేమ్‌ | Congress Leaders Criticised Aap For Election Loss In Delhi | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కామ్‌ వల్లే ఢిల్లీలో సీట్లు రాలేదు: కాంగ్రెస్‌ నేతలు

Jun 30 2024 3:40 PM | Updated on Jun 30 2024 3:56 PM

Congress Leaders Criticised Aap For Election Loss In Delhi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే కాంగ్రెస్‌ పార్టీ తన మిత్రపక్షమైన ఆమ్‌ఆద్మీపార్టీపై(ఆప్‌) బ్లేమ్‌గేమ్‌ ప్రారంభించింది. ఢిల్లీలో పోటీ చేసిన సీట్లలో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి  లిక్కర్ స్కామే కారణమని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌దత్‌ అన్నారు. తాము గనుక ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవన్నారు.

 ఢిల్లీలో నీటి సంక్షోభం వస్తే మంత్రి అతిషి చర్యలు తీసుకోవాల్సిందిపోయి నిరాహారదీక్ష పేరుతో డ్రామా చేసిందని విమర్శించారు. భారీ వర్షం పడి ఢిల్లీ స్తంభించి పోవడానికి ఆప్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మరో కాంగ్రెస్‌ నేత  దేవేందర్‌యాదవ్‌ విమర్శించారు. 

కాంగ్రెస్‌ నేతల విమర్శలకు ఆప్‌ స్పందించింది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిపక్షపార్టీలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని, వాటి మధ్య చీలికలు మంచివి కావని ఆప్‌ నేత సౌరభ్‌భరద్వాజ్‌ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement