తాత, తండ్రుల నుంచి భూమిని సాగు చేసుకుంటున్నాం. రెవెన్యూ అధికారులు తమ భూమిని ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. కబ్జాలో, పట్టాలో నేనే ఉన్నప్పటికీ ఆన్లైన్లో కనబడడం లేదు. అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలి.
– కొమ్ము మల్లేశం, రైతు, వడుకాపూర్
అక్రమ పట్టా రద్దు చేయాలి
సుల్తానాబాద్ మండలం కనుకుల శివారులో సర్వే నంబర్ 221లో అక్రమంగా 11 ఎకరాల 23 గుంటల భూమిని జిన్న శ్రీలత పట్టా చేసుకున్నారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తికి పట్టా ఎలా చేస్తారు. అక్రమ పట్టా రద్దు చేసి, నిబంధనలకు విరుద్ధంగా పట్టా చేసిన అధికారిపై చర్య తీసుకోవాలి. సదరు భూమిని ప్రజల అవసరాలకు కేటాయించాలి.
– సర్పంచ్ కవిత, గ్రామస్తులు, కనుకుల


