కర్ణాటక వాటర్‌ ఫాల్స్‌లో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక వాటర్‌ ఫాల్స్‌లో యువకుడి మృతి

Apr 7 2026 8:25 AM | Updated on Apr 7 2026 8:25 AM

కోరుట్ల: కర్ణాటకలోని అంకోలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విభూత వాటర్‌ ఫాల్స్‌లో ప్రమాదవశాత్తు పడి కోరుట్ల మున్సిపల్‌ వీలిన గ్రామం ఎఖీన్‌పూర్‌కు చెందిన శీలం అజయ్‌గౌడ్‌(25) మృతిచెందాడు. వివరాలు.. ఎఖీన్‌పూర్‌కు చెందిన శీలం వెంకటేశ్‌–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అజయ్‌గౌడ్‌ 15 రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. ఆదివారం సరదాగా హైదరాబాద్‌లో ఉండే ఇద్దరు స్నేహితులతో కలిసి కర్ణాటక టూర్‌ వెళ్లాడు. సోమవారం ఉదయం అంకోలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విభూత వాటర్‌ ఫాల్స్‌లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో ఉన్న రాయి తాకి శ్వాస ఆడక మృతిచెందినట్లు సమాచారం. ఆయన వెంట ఉన్న స్నేహితులు ఆజయ్‌గౌడ్‌కు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. సోమవారం సాయంత్రం కర్ణాటక వెళ్లారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement