జిల్లాకేంద్రంలోని జెండా వద్ద పార్కింగ్ చేసిన తన టూవీలర్ కనిపించకుండా పోయిందని బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు వెంటనే కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అయితే, సీసీ కెమెరాల చుట్టూ రాజకీయ నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలే దర్శనమివ్వడంతో టూవీలర్ను ఎవరు దొంగిలించారో కనిపించక పోలీసులు తలలు పట్టుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే జెండా కూడలిలో సీసీ కెమెరాల చుట్టూ ఉన్న ఇలాంటి ఫ్లెక్సీలు తొలగిస్తే పోలీసుల పనిసులువు అవుతుందని స్థానికులు కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


