ఖోఖో పోటీల్లో రెండోస్థానం
పెద్దపల్లిరూరల్: జిల్లాగా అవతరించిన తర్వాత సబ్ జూనియర్ ఖోఖో పోటీల్లో పెద్దపల్లి జిల్లా పట్టు పాల్గొని రెండోస్థానంలో నిలిచింది. ఇటీవల నారాయణపేట జిల్లాలో జరిగిన సెమీ ఫైనల్లో మహబూబ్నగర్పై గెలిచి ఫైనల్కు చేరింది. ఫైనల్లో ఆదిలాబాద్ జిల్లా జట్టుతో తలపడిందని ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, కుమార్ తెలిపారు. భవిష్యత్లో జిల్లాజట్టు రాష్ట్రస్థాయిలో మంచిగుర్తింపు సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్, ఉపాధ్యక్షులు నారాయణ, ప్రసాద్, షపీ, సంధ్యారాణి, రిటైర్డ్ పీడీ వైద కిష్టయ్య, గణేశ్ హర్షం వ్యక్తం చేశారు.
నియామకం
కమాన్పూర్(మంథని): తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన మట్ట రాజయ్యను నియమించారు. ఈమేరకు జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొగే పద్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఖోఖో పోటీల్లో రెండోస్థానం


