జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు

Oct 15 2025 5:38 AM | Updated on Oct 15 2025 5:38 AM

జాప్య

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు

వైద్య సిబ్బందికి టీకా సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): వైద్య సిబ్బంది రక్షణకు వ్యాధి నిరోధక టీకా ప్రక్రియ ప్రా రంభించినట్లు జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్య సిబ్బందికి హెపటైటిస్‌ –బి నిరోధక టీకా కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో ప్రారంభించి మాట్లాడారు. హెపటైటిస్‌ –బి బాధితులకు వైద్యసేవలు అందించే వారికి కూడా వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని, అందుకే సిబ్బందికి టీకా వేస్తున్నామని తెలిపారు. ప్రోగ్రాం అధికారి కిరణ్‌కుమార్‌, వైద్యుడు ఉదయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. గర్రెపల్లిలో ఎన్‌ఎస్‌వో సర్వే సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): గర్రెపల్లిలో మంగళవారం జాతీయ గృహ ప్రయాణాలపై ఎన్‌ఎస్‌వో అధికారులు సర్వే చేశారు. జాతీయ గృహ ప్రయాణ సర్వేతోపాటు ప్రజా రవాణా వినియోగంపై సమచారం సేకరించి కేంద్రమంత్రిత్వ శాఖకు నివేదించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. నాయబ్‌ తహసీల్దార్‌ రాకేశ్‌, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంపీఎస్‌వో భవాని, ఎన్‌ఎస్‌వో అధికారులు శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనాథ్‌, రాజేందర్‌, పంచాయతీ కార్యదర్శి ఖాజామొయినొద్దీన్‌, కారోబార్‌ వెంకన్న తదితరులు ఉన్నారు.

రామగిరి(మంథని): కోల్‌మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(సీఎంపీఎఫ్‌) సేవలను జాప్యం లేకుండా అందిస్తామని రీజినల్‌ కమిషనర్లు హరిపచౌరి, కె.గోవర్ధన్‌ అన్నారు. స్థానిక జీఎం కార్యాల యంలో అధికారులు, ఉద్యోగులతో ప్రయాస్‌ కార్యక్రమంపై మంగళవారం అంగాహన క ల్పించారు. సీఎంపీఎఫ్‌ లావాదేవీలన్నీ సీ–కే ర్స్‌ పోర్టల్‌ ద్వారానే జరుగుతున్నాయన్నారు. మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా సేవలు పొందాలని సూచించారు. ఆర్జీ–3 జీఎం సుధాకరరావు మాట్లాడుతూ, ఉద్యోగుల సీఎంపీ ఎఫ్‌ వివరాలను పరిశీలించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్సనల్‌ విభాగాధిపతి సుదర్శనం, ఫైనాన్స్‌ డీజీఎం సురేఖ, డీవైపీఎం సునీల్‌ప్రసాద్‌, సీనియర్‌ పీవో రాజేశం, సివిల్‌ అధికారి మనోజ్‌, సీఎంపీఎఫ్‌ సి బ్బంది కామేశ్వరరావు, అనిత, మనోహర్‌, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలు శుభ్రం

గోదావరిఖని: స్థానిక సీఎంపీఎఫ్‌ కార్యాలయంలో మంగళవారం స్వచ్ఛ పక్వాడా నిర్వహించా రు. ఈసందర్భంగా కార్యాలయం ముందున్న చెత్తను క్లీన్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్జీ–1 ఎస్‌ఓటూ జీఎం చంద్రశేఖర్‌, సీఎంపీఎఫ్‌ కమీషన ర్‌ హరిపచౌరీ, కె.గోవర్థన్‌ పాల్గొన్నారు.

‘రైతునేస్తం’లో డీఏవో

పెద్దపల్లిరూరల్‌: వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రాష్ట్రంలోని పలువురు రైతులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి రైతువేదిక ద్వారా జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌, ఏడీఏ శ్రీనాథ్‌, ఏవో అలివేణి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. క్లస్టర్‌ అధికారులు కల్పన, వినయ్‌, ప్రశాంత్‌, పూర్ణచందర్‌, సువర్చల, రచన, రైతులు పాల్గొన్నారు.

వైన్స్‌షాప్‌లకు 84 టెండర్లు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమ వారం వరకు 74 టెండర్లు దాఖలు కాగా.. మంగళవారం మరో 10 దరఖాస్తులు తమకు అందాయని ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 84 దరఖాస్తులు అందాయని ఆయన వివరించారు. ఈనెల 18 ఆఖరుతేదీగా ఆయన పేర్కొన్నారు.

జాప్యం లేకుండా   సీఎంపీఎఫ్‌ సేవలు 1
1/3

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు

జాప్యం లేకుండా   సీఎంపీఎఫ్‌ సేవలు 2
2/3

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు

జాప్యం లేకుండా   సీఎంపీఎఫ్‌ సేవలు 3
3/3

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement