
రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన గాండ్ల సత్యం (53)అనే సింగరేణి ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. తన కూతురు ముద్దసాని లావణ్యను పెద్దపల్లిలోని కాలేజీలో చేర్పించేందుకు బైక్పై వస్తున్నాడు. అప్పన్నపేట శివారులో డివైడర్ను అదుపుతప్పి ఢీకొన్నాడు. ఆ తర్వాత డివైడర్ ఆవతల ఉన్న రోడ్డుపైకి పడ్డాడు. ఇంతలోనే అటుగా వేగంగా వస్తున్న లారీ సత్యం పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. వెంట ఉన్న కూతురు డివైడర్పై పడగా గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై మల్లేశ్ తన సిబ్బందితో వెళ్లి గాయపడ్డ లావణ్యను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.