అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

May 31 2025 12:54 AM | Updated on May 31 2025 12:54 AM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ఎలిగేడు/జూలపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం ఎలిగేడు మండలం లాలపల్లి, ఎలిగేడు, ర్యాకల్‌దేవుపల్లి, రాములపల్లి, జూలపల్లి మండలం నాగులపల్లె, చీమలపేట, తేలుకుంటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని ఒక్క ఇల్లు ఇవ్వకుండా పేదలను మోసం చేసిందన్నారు. ఎలిగేడు నుంచి లాలపల్లి వరకు రూ.3కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే మండల కేంద్రంలో మంత్రి చేతులమీదుగా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించుకుంటామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తడిసిన, రంగుమారిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌ యాకన్న, ఎంపీడీవోలు భాస్కర్‌రావు, పద్మజ, ఎంపీవో అనిల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వేణుగోపాలరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గండు సంజీవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, దుగ్యాల సంతోష్‌రావు, బాలుసాని పరుశరాములుగౌడ్‌, రాజేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, పల్లెర్ల వెంకటేశ్‌గౌడ్‌, బూర్ల వెంకటసత్యం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే విజయరమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement