
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి
పెద్దపల్లిరూరల్: ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠ శాలలను బలోపేతం చేయాలని పట్టభద్రుల ఎ మ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో చేపట్టిన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరానికి బుధవారం ఆయన హాజరై మాట్లాడా రు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా నని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డీఈవో మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షు డు సంజీవరెడ్డి, నాయకులు శివంగారి సతీశ్, మంథెన కృష్ణ, కాసనగొట్టు విజయ్, సందీప్, రామగిరి అఖిల్, రవీందర్ తదితరులు ఉన్నారు.
మానవ అక్రమరవాణా నిర్మూలిద్దాం
మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని డీఈవో మాధవి, ప్రజ్వ ల సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ బలరామకృష్ణ అన్నారు. విద్యాపరిశోధన శిక్షణ సంస్థ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండురోజుల శిక్షణ శిబిరం బుధవారం ప్రారంభమైంది. ఆర్థిక, సామాజిక కారణాలతో ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి మాయామాటలతో నమ్మించి వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.