
ఎన్కౌంటర్ మృతదేహాలను ఎందుకివ్వరు?
పెద్దపల్లిరూరల్: ఎన్కౌంటర్ పేరిట మావోయిస్టులు నంబాల కేశవరావు సహా 27మందిని హ తమార్చిన పాలకులు మృతదేహాలను వారి కు టుంబసభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రజా, పౌరహక్కుల సంఘాల నేతలు ప్రశ్నించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు. నారాయణపూర్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ఛత్తీస్గఢ్ పో లీసులు ఎన్కౌంటర్ మృతదేహాలకు అంత్యక్రియలు జరపడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కుమారస్వామి, లక్ష్మణ్, రవి, కొమురయ్య, ర వీందర్, రాజయ్య, సుదర్శన్, అశోక్, శ్రావణ్, ఆంజనేయశర్మ, సుచరిత, పర్వతాలు, సత్యనారాయణ, మల్లేశం, సుధాకర్, జగన్ ఉన్నారు.