
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● కేంద్ర పర్యావరణ డైరెక్టర్ తరుణ్ కుమార్
గోదావరిఖని/రామగిరి(మంథని): పర్యావరణా న్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ కె.తరుణ్కుమార్ అన్నారు. ప్లాస్టిక్ను వినియోగించవద్దన్నారు. బుధవారం ఆయన ఆర్జీ– 2, 3, ఏపీఏలో పర్యటించారు. తొలుత ఉద్యోగులకు జూట్ బ్యాగులు అందజేశారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం వకీల్ప ల్లిగని, పెంచికల్పేట, న్యూపెద్దంపేట, మారేడు పాక, ఓిసీపీ–1, జూలపల్లి, ముల్కలపల్లి, పన్నూ ర్, రత్నాపూర్, నాగేపల్లి గ్రామాల్లో పర్యటించా రు. ఓసీపీ–1పై రెమిడేషన్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పనుల వివరాల గురించి జీఎం నాగేశ్వరరా వు ఆయనకు వివరించారు. కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ విభాగం జీఎం సైదులు, ఎస్వో టు జీ ఎం రామ్మోహన్, ఏరియా ఇంజినీర్ శేఖర్బాబు, ఫైనాన్స్ ఏజీఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.