అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Jun 5 2025 7:44 AM | Updated on Jun 5 2025 7:44 AM

అర్హు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ఓదెల(పెద్దపల్లి): అర్హులైన వారందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గుండ్లపల్లిలో బుధవారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ము గ్గుపోశారు. సీసీ రోడ్ల నిర్మానం ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. మాజీ సర్పంచ్‌ పుప్పాల శంకర్‌, సింగిల్‌విండో చైర్మన్‌ ఆళ్ల సుమన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అ ధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షు డు పెద్దిరెడ్డి రఘపతిరెడ్డి పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం

జ్యోతినగర్‌(రామగుండం): భూ సమస్యల ప రిష్కారమే లక్ష్యంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఆర్డీవో గంగయ్య తె లిపారు. ఐదో డివిజన్‌ మల్కాపూర్‌లో బుధవా రం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యలపై మీ సేవ కేంద్రం ద్వారా ఉచితంగా దరఖాస్తు చేయొచ్చన్నారు. తహసీల్దార్‌ దత్తుప్రసాద్‌రావు, నాయ బ్‌ తహసీల్దార్లు ఈశ్వర్‌, కోటేశ్వ్‌రావు, గిర్దావ ర్లు ఇంతియాజ్‌, రాజేందర్‌, సంపత్‌కుమార్‌, సీనియర్‌ సహాయకులు శ్రావణి, చంద్రశేఖర్‌, రవీందర్‌, ఏఎస్సై తిరుపతి పాల్గొన్నారు.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): సీజనల్‌ వ్యాధులు ప్ర బలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని జె డ్పీ సీఈవో నరేందర్‌ ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన బుధవారం త నిఖీ చేశారు. నీటినిల్వలు తొలగించాలని, డ్రైనేజీలు శుభ్రం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చైతన్యవంతం చేయాలని కోరారు. ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంపీవో సమ్మిరెడ్డి, ఈజీఎస్‌ ఏపీ ఎం మల్లేశ్వరి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

శాంతికి భంగం కలిగించొద్దు

గోదావరిఖని: ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌ హెచ్చరించారు. బక్రీద్‌ను పురస్కరించుకుని స్థానిక వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో బుధవారం పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. అనుమతిలేకుండా, పశువైద్యుని ధ్రువీకరణ లేకుండా పశువులను రవాణా చేస్తే ఊరు కోబోమన్నారు. బహిరంగ ప్రదేశాలల్లో పశువులను వధించరాదని తెలిపారు. సోషల్‌ మీడియాలో వదంతులు ప్రచారం చేసినా చర్యలు తప్పవని అన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు రమేశ్‌, భూమేశ్‌, ఉదయ్‌కిరణ్‌, సంధ్యారాణి, మతపెద్దలు పాల్గొన్నారు.

అభ్యంతరాలు స్వీకరిస్తాం

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థను 60 వార్డులుగా విభజిస్తూ ము సాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు కమిషనర్‌(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ తెలిపారు. ఈ మేర కు బల్దియా కార్యాలయ నోటీస్‌ బోర్డుపై నోటి ఫికేషన్‌ ప్రదర్శనకు ఉంచినట్లు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఈనెల 11వ తేదీ వరకు కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్‌ కోరారు.

శాంతిచర్చలు జరపాలి

గోదావరిఖని: ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. బు ధవారం స్థానిక భాస్కర్‌రావు భవన్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. శాంతిచర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా స్పందించకుండా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నరమేధాన్ని కొనసాగిస్తున్నారని, ఇప్పటికైనా కాల్పుల విర మణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 14న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాను వి జయంతం చేయాలని కోరారు. ఇ.నరేశ్‌, తాండ్ర సదానందం, వై.యాకయ్య, ఐ.కృష్ణ, జూ పాక శ్రీనివాస్‌, దాముక లచ్చయ్య, గౌతమ్‌ గోవర్ధన్‌, మహేశ్వరి, ఐ.రాజేశం, రమేశ్‌, రామచందర్‌, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు 1
1/3

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు 2
2/3

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు 3
3/3

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement