
న్యాయవాదుల సమస్యలపై కేబినెట్లో చర్చించండి
మంథని: రాష్ట్ర కేబినెట్లో న్యాయవాదుల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని లాయర్స్ ఇండియా ఆర్గనైజేషన్ న్యాయవాదుల బృందం గురువారం హైదరాబాద్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు వినతిపత్రాలు అందజేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.10 లక్షల వరకు హెల్త్ కార్డులు పునరుద్ధరణ చేయాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేలు స్టైఫండ్, ఇళ్ల స్థలాలు, రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో దివ్యాంగులైన న్యాయవాదులకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం తదితర సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. లాయర్స్ ఇండియా ఆర్గనైజేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొన్నం రవీందర్, రాష్ట్ర కన్వీనర్ ఇనుముల సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలె నర్సింహ, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆంటోనిరెడ్డి, కుమార్స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆర్థికాభ్యున్నతి సాధించేందుకే మహిళాశక్తి
పెద్దపల్లిరూరల్: మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలన్న ఆలోచనతో సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఇందిరా మహిళాశక్తి పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మహిళాశక్తి పథకం కింద మంజూరైన క్యాంటీన్ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి వచ్చే వారికి క్యాంటీన్ ద్వారా రుచి, శుచికరమైన పదార్థాలు అందించాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, డీఆర్డీవో కాళిందిని, మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు మల్లయ్య, సంపత్, శ్రీనివాస్, ఉప్పు రాజు, బొంకూరి అవినాష్, జడల సురేందర్, జగదీశ్ తదితరులున్నారు.
నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి
ఓదెల(పెద్దపల్లి): గ్రామాల్లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. గురువారం మండలంలోని కొలనూర్ గ్రామపంచాయతీని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామంలోని నర్సరీ, సెగ్రిగ్రేషన్షెడ్డు, శ్మశానవాటికను పరిశీలించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటారు. ఎంపీవో షబ్బీర్ అలీ, కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులను బడిబాట పట్టించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించేలా విద్యార్థులను బడిబాట పట్టించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో గురువారం డీఈవో మాధవి, సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట నిర్వహించి బడీడు పిల్లలంతా సర్కారు బడుల్లో చేర్పించేలా తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలన్నారు. గతేడాది జిల్లాలో బడిబాట కార్యక్రమం ద్వారా 2,099 మంది విద్యార్థులను చేర్పించినట్టు గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తొలిరోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. 10,186 మంది నిరక్షరాస్యులను ఉల్లాస్ కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి విద్యనందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచేందుకు స్వశక్తి మహిళలు సైతం తమవంతు సహకారం అందించాలన్నారు. జెడ్పీసీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య తదితరులున్నారు.

న్యాయవాదుల సమస్యలపై కేబినెట్లో చర్చించండి

న్యాయవాదుల సమస్యలపై కేబినెట్లో చర్చించండి