
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
పెద్దపల్లిరూరల్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా గురువారం కోర్టు ఆవరణలో సెక్రటరీ స్వరూపరాణితో కలిసి మొక్కలు నాటారు. కరోనా కాలంలో అవసరమైన ఆక్సిజన్ కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చిన పరిస్థితిని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరి స్థితులు పునరావృతం కాకుండా అందరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్, లోక్అదాలత్ సభ్యుడు శ్రీధర్తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.