
రేషన్షాపు.. బడిబాట
కాల్వశ్రీరాంపూర్: మూడు నెలలకు సరిపడా బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో కార్డుదారులు భారీగా తరలివస్తారని భావించిన స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.. శనివారం స్థానిక రేషన్ షాపు ఎదుట బడిబాట కార్యక్రమం చేపట్టారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యాబోధన ఉందని, సన్నరకం బియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, ఉచితంగా పుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫామ్స్ అందిస్తున్నామని, మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని వారు కోరారు.