
అరెస్ట్ చేసి ఎన్కౌంటర్లా?
గోదావరిఖని: మావోయిస్టు నాయకులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చకుండా ఎన్కౌంటర్ చే యడం ఏమిటని సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ నేత చలపతిరావు విమర్శించారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మూడురోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ నేషనల్ పార్క్లో అరెస్టు చేసిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు(చలం) సుధాకర్ను చిత్రహింసలు పెట్టి దారుణంగా ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. పోలీసుల అధీనంలో ఉన్న మిగతా నాయకులను కూడా ఎన్కౌంటర్ చేసి చంపివేసే ప్రమాదం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శాంతిచర్చలకు ముందుకు వచ్చిన మా వోయిస్ట్లు కాల్పుల విరమణ పాటిస్తున్నారని, నిరాయుధులుగా ఉన్న వారిపై హత్యాకాండ కొ నసాగించడాన్ని ప్రజలంతా ఖండించాలని ఆయ న కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ అధీనంలో ఉన్న వారిని కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఐ.కృష్ణ, ఇ.నరేశ్, వెంకన్న, అశోక్, శంకర్, బుచ్చక్క తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ నేత చలపతిరావు