
లాభసాటి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి
రామగుండం: మారుతున్న వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ లాభసాటి వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంలో భాగంగా టీటీఎస్ అంతర్గాం, ఎల్లంపల్లితో శనివారం వ్యవసా య శాస్త్రవేత్తలు రైతులతో సమావేశమయ్యా రు. బీజీ–3 పత్తి విత్తనాలు వాడొద్దన్నారు. ఈ వానాకాలంలో జూన్ – అక్టోబర్ మధ్య వరి సాగు పూర్తి చేయాలని అన్నదాతలకు వారు సూచించారు. నానో యూరియా వినియోగించాలని తెలిపారు. మహిళా సంఘాలకు అద్దెకు ఇచ్చేందుకు డ్రోన్లు అందుబాటులో ఉన్నాయ ని అన్నారు. కోళ్ల, మేకలు, గొర్రెలు, చేపల పెంపకం లాభసాటిగా ఉంటుందంని వివరించారు. కార్యక్రమంలోవ్యవసాయ శాస్త్రవేత్తలు రీతూపర్ణ బెనర్జీ, బీవీడీ శ్రీనివాస్రావు, ఎస్ఎ స్ పాల్, వెంకన్న, కిరణ్, నరేశ్, వ్యవసాయా ధికారులు సతీశ్, హరీశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని కాయకల్ప బృందం ప్రతినిధులు సతీశ్బాబు, స్టీల్జా తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని కాయకల్ప బృందం శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ ఆస్పత్రులకు స్వచ్ఛ అవార్డులు అందజేస్తోందని, ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రుల్లో సేవలను తాము పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి, సిబ్బంది పనితీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, గదులు, ఆపరేషన్ థియేటర్, పరికరాల వినియోగం, బయో మెడికల్ వేస్టేజీ నిర్వహణ తదితర అంశాలు పరిశీలించామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రమాదేవి, ఆర్ఎంవోలు మహేందర్, విశాల్, అనిల్, సతీశ్, రాజు, ఫర్హాద్, సునీత, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
నేడు రెవెన్యూ మేళా
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ మేళా ఏ ర్పాటు చేసినట్లు కమిషనర్ (ఎఫ్ఏసీ) అరు ణశ్రీ శివారం తెలిపారు. ఆస్తిపన్నులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆస్తిపన్ను సరిచేస్తామని పేర్కొన్నారు. ఇంటిపన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
పారదర్శకంగా ప్రవేశాలు
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్కాలనీ సెక్టార్–3 సింగరేణి సీబీఎస్ఈ పాఠశాలలో ప్రవేశాలు పారదర్శకంగా కల్పిస్తున్నామని కరస్పాండెంట్, అధికార ప్రతినిధి అనిల్కుమార్ శనివారం తెలిపారు. విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించి ప్రతిభ ఆధారంగానే అడ్మిషన్లు ఇస్తామన్నారు. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. హెచ్ఎం సుందర్రావు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): స్థానిక సెక్టార్–3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ పద్ధతిన విద్యా బోధన చేసేందుకు అర్హులైన బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తులు స్వికరిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఇంగ్లిష్ – 3, ఫిజిక్స్ –2, కంప్యూ టర్ –1, ప్రైమరీ టీచర్లు–1, ప్రీప్రైమరీ–4, లైబ్రెరేయన్–1, ఆఫీస్ సూపరింటెండెంట్–1, జూనియర్ అసిస్టెంట్ –3, ల్యాబ్ అటెండర్– 1, నైట్వాచ్ మన్–1, సోషల్ టీచర్–1, సైన్స్ టీచర్–1, క్లాస్ఫోర్త్–1, పీఈటీ–1, ఆయా–2 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హతల ఆధారంగా భర్తీచేస్తామని ప్రకటించింది. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 13లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని కరస్పాండెంట్ అనిల్కుమార్ కోరారు.

లాభసాటి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి