
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం
పెద్దపల్లిరూరల్: పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరం పాటుపడదామని, ఇందకనుగుణంగా మార్పు మన నుంచే మొదలు కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఫారెస్టు అధికారుల ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ వేణు, డీసీపీ కరుణాకర్తో కలిసి శ్రీఏక్ పేడ్ మా కే నామ్శ్రీ పేరిట మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తన తల్లి పేరిట మొక్కలు నాటి కాపాడాలన్నారు. కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ వస్తువుల వాడకం తగ్గాలన్నారు. ప్రభుత్వోద్యోగులు తమ ఇళ్లలోనూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లా అటవీ అధికారి శివయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.
విద్యా సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఎంఈవోలు, కాంప్లెక్సు హెచ్ఎంలు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన వర్క్షాపులో మాట్లాడారు. ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డీఈవో మాధవి, సమన్వయకర్త పీఎం షేక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష