
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జ్యోతినగర్/ఫెర్టిలైజర్సిటీ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత, ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింగల్ అనారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీపీసీ రామగుండంలో ఈడీ పర్యావరణ ర్యాలీ అనంతరం మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీపీసీ రామగుండం– తెలంగాణ ప్రా జెక్టులు పర్యావరణ బాధ్యతలకు కట్టుబడి ఉన్నాయన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తొలగించడానికి సమష్టి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు జనపనార బ్యాగులు, ప ర్యావరణ పరిరక్షణ క్రమంలో నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, జనరల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారంలో సీఈవో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. సీజీఎం ఉదయ రాజహంస, రమేశ్ ఠాకూర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత, ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింగల్

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత